Fact Check : రాజస్థాన్ రాయల్స్ జట్టు పంజాబ్ ను ట్రోల్ చేస్తూ అర్జున్ కపూర్ మీమ్ పోస్ట్ చేయడం, ఆ తర్వాత డిలీట్ చేయడం సంచలనంగా మారింది. అయితే ఆయన కోర్టులో కేసు పెట్టాడు అన్న ప్రచారంలో నిజం లేదు.

Fact Check : ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు సరిగ్గా సమయానికి పుంజుకుని ప్లేఆఫ్స్కు అర్హత సాధించి వార్తల్లో నిలిచింది. అయితే, ప్లేఆఫ్స్ చేరిన ఆనందంలో ఆ జట్టు సోషల్ మీడియా హ్యాండిల్ చేసిన ఒక చిన్న తప్పు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ముంబై ఇండియన్స్తో జరిగిన కీలక మ్యాచ్లో 30 పరుగుల తేడాతో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్, ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇదే సమయంలో పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు టోర్నమెంట్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పంజాబ్ జట్టును ఎగతాళి చేస్తూ రాజస్థాన్ రాయల్స్ ఒక మీమ్ పోస్ట్ చేసింది.